Sunday 29 April 2012

రాగి దోశలు

కావాల్సిన  పదార్ధాలు  :

రాగి పిండి -1 కప్పు
జొన్న పిండి-1 కప్పు
గోధుమ పిండి-1 కప్పు
ఉప్పు తగినంత
నీళ్ళు తగినన్ని
ఉల్లిపాయలు- 2
క్యారెట్- 1
నూనె తగినంత

తయారు చేసే  విధానం:

ముందుగా పైన చెప్పిన పిండ్లన్నీ ఒక గిన్నెలో వేసి తగినంత నీళ్ళు,ఉప్పు వేసి దోశల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి బాగా కలపండి. పిండి ఒక గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్వు మీద దోశల పెనం పెట్టి అది వేడెక్కాక దోశలుగా వేయాలి.




No comments:

Post a Comment