Tuesday 27 March 2012

సగ్గుబియ్యం ఉప్మా

కావాల్సిన  పదార్ధాలు  :  

సగ్గుబియ్యం- 1 కప్పు
పల్లీలు-1/4 కప్పు
మినపప్పు- 1 స్పూను
ఆవాలు -1 స్పూను
జీలకర్ర- 1 స్పూను
జీడిపప్పు పది
కరివేపాకు-1 రెమ్మ
కొత్తిమీర
ఉల్లిపాయ-1
మిరపకాయలు-2
క్యారెట్ ఒకటి
ఉప్పు తగినంత
నూనె తగినంత
పసుపు చిటికెడు


తయారు చేసే  విధానం:


ముందుగా పల్లీలు వేయించి పొట్టు తీసి పొడి చేసి పెట్టుకోండి
సగ్గుబియ్యం ముందుగా ఒక 4 గంటల ముందు నానపెట్టుకొవాలి .
ఇప్పుడు ఒక గిన్నె/బాండి  స్టవ్వు మీద పెట్టి నూనె వేసి పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు,క్యారెట్ ముక్కలు, కరివేపాకు పచ్చి మిరప ముక్కలు,ఉప్పు,పసుపు వేసి వేయించాలి. అవి వేగాక ఇప్పుడు నానపెట్టిన సగ్గుబియ్యం లో నీళ్ళు వంపేసి బాండి లొ వేసి బాగా కలపండి. మూత పెట్టి మధ్య మధ్య లో కలుపుతూ ఉండండి. చివరగా పల్లీల పొడి చల్లి బాగ కలిపి కొత్తిమీర చల్లండి.